https://www.facebook.com/pages/INI/410062352474440
చరిత్రలో ఈ రోజు
నవంబర్ 22:
- 1830 : ఝాన్సీ లక్ష్మీబాయి పరాక్రమాన్ని తలపించే అరుదైన చరిత్రకు ప్రతీక దళిత సిపాయి వీరనారి ఝల్కారీబాయి జననం (మ. 1857 లేదా 1890).
- 1907 : ప్రఖ్యాత గణితావధాని, గణిత శాస్త్రవేత్త లక్కోజు సంజీవరాయశర్మ జననం (మ.1997).
- 1913 : భారత దేశపు ఆర్థిక వేత్త మరియు భారతీయ రిజర్వ్ బాంక్ గవర్నర్ గా పనిచేసిన 8 వ వ్యక్తి ఎల్.కె.ఝా జననం (మ.1988).
- 1963 : అమెరికా సంయుక్త రాష్ట్రాలకు 35వ అధ్యక్షుడు గా పనిచేసిన జాన్ ఎఫ్ కెనడి మరణం (జ.1917).
- 1967 : జర్మనీకి చెందిన ఒక మాజీ ప్రపంచ నం. 1 టెన్నిస్ క్రీడాకారుడు బోరిస్ బెకర్జననం.
- 1968 : మద్రాసు రాష్ట్రం పేరును తమిళనాడు గా మార్చే బిల్లును లోక్సభఆమోదించింది.
- 1970 : శ్రీలంకకు చెందిన మాజీ క్రికెట్ కెప్టెన్ మర్వన్ ఆటపట్టు జననం.
- 1988: బాబా ఆమ్టే కు ఐరాస మానవహక్కుల పురస్కారం లభించింది.
- 1997: హైదరాబాదు లో ఇండో అరబ్ సాంస్కృతిక కేంద్రానికి పాలస్తీనా నేత యాస్సిర్ ఆరాఫత్ శంకుస్థాపన చేసాడు.
- 2006 : ప్రముఖ భారతీయ మహిళా రసాయన శాస్త్రవేత్త అసీమా చటర్జీ మరణం (జ.1917).
No comments:
Post a Comment